కొండగట్టు బస్సు ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

Update: 2018-09-11 07:11 GMT

కొండగట్టులో బస్సు ప్రమాదం విషయం తెలియడంతో సీఎం కేసీఆర్ వెంటనే, జిల్లా అధికారులకు ఫోన్ చేసి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సీఎం ఆదేశాలతో  జిల్లా ఎస్పీ, కలెక్టర్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు.   
 

Similar News