దిక్కులేక కాంగ్రెస్ గెలిచింది: కేసీఆర్

Update: 2018-12-11 12:20 GMT

ముందస్తు ఎన్నికలతో రణరంగంలో దిగి హోరాహోరా పోరులో తిరుగులేని విజయం సాధించింది టీఆర్ఎస్ పార్టీ. ఈ సందర్బంగా తెలంగాణ ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ ఇప్పుడు జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో ప్రజలు త్రీవంగా విసిగిపోయి ఎటుతొచక వేరే దిక్కులేక మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను గెలిపించారన్నారు. కాంగ్రెస్, బీజేపీ ముక్త భారత్ కావాలని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీయేతర ప్రజా ప్రభుత్వం కేంద్రలో అధికారంలోకి రావాలని, కేంద్ర రాజకీయాల్లో తప్పకుండ టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. మన దేశంలోని మైనారిటీలు, పేదల కోసం టీఆర్ఎస్ సర్కారు పని చేస్తుందన్నారు. నిన్న అసదుద్దీన్ ఒవైసీతో కూడా తాను దేశ రాజకీయాల గురించే చర్చించానని కేసీఆర్ తెలిపారు.

Similar News