టీఆర్ఎస్ అధ్యక్షుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వెల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సరిగ్గా 2 గంటలా 34 నిముషాలకు గజ్వెల్ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనుకున్న సమయానికే ఆర్డీవో కార్యాలయం చేరుకున్న ఆయన అట్టహాసాలకు దూరంగా నామినేషన్ వేశారు. కేసీఆర్ వెంట హరీశ్రావుతో పాటు మరో ఐదుగురు ముఖ్యులు మాత్రమే ఉన్నారు. కాన్వాయ్ను పక్కన పెట్టిన కేసీఆర్ కేవలం మూడు కార్లలోనే ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని నామినేషన్ వేశారు.