మహాకూటమి అభ్యర్ధుల పక్షాన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు కూడా ప్రచారం సాగించారు. మలక్పేట అభ్యర్ధికి మద్ధతుగా రోడ్షో నిర్వహించిన ఆయన టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ ఒక్కటై ప్రజలను మోసం చేస్తున్నాయంటూ ఆరోపించారు. మైనార్టీలకు నష్టం కలిగించే ట్రిపుల్ తలాక్ బిల్లును టీడీపీ వ్యతిరేకిస్తే ఎంఐఎం, టీఆర్ఎస్లు కనీసం స్పందించలేదంటూ విమర్శించారు. కేంద్రంలో సీనియర్ మోడీ, తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ మోడీ ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారంటూ చంద్రబాబు ఆరోపించారు . ఈ ఎన్నికల్లో మహాకూటమి విజయం తథ్యమని చంద్రబాబు నాయుడు థీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఓటుతోనే డిసెంబర్ 11న తేల్చిచెబుతారని వ్యాఖ్యనించారు.