ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై దాడి జరిగింది. సచివాలయంలో ఉన్న కేజ్రీవాల్పై కారంపోడితో ఓ యువకుడు దాడి చేశారు. కేజ్రీవాల్ కళ్లలో కారం పొడి పడటంతో హుటాహూటిన భద్రతా సిబ్బంది స్పందించారు. దాడి చేసిన యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనీల్ శర్మగా గుర్తించారు. దాడి ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆప్ దేశ రాజధానిలో సీఎంకు కూడా భద్రత లేకుండా పోయిందంటూ విమర్శించారు.