కూలిన విమానం...అయిదుగురి మృతి

Update: 2018-06-28 09:17 GMT

ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఓ చార్టర్డ్ విమానం ముంబైలోని ఓ రద్దీ ప్రాంతంలో కూలిపోయింది. ఇవాళ మధ్యాహ్నం ఘట్కోపూర్‌లో సర్వోదయ్ నగర్‌లో ఈ ప్రమాదం చేసుకుంది. ఘట్‌కోపర్‌ ప్రాంతంలో ల్యాండ్‌ అవుతండగా అదుపుతప్పిన విమానం.. నివాసాల మధ్యే కూలిపోయింది. ఈ విమానంలో ఇద్దరు పైలెట్లు, ఇద్దరు ఇంజినీర్లు ఉన్నట్లు సమాచారం. వీరందరూ ఈ ఘటనలో మరణించారు. పైగా ఈ విమానం కూలిన చోట రోడ్డుపై వెళుతున్న ఓ వ్యక్తి కూడా మృతి చెందాడు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంద ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
 

Similar News