తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. నాలుగేళ్లలోనే రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన గులాబీ దళపతి కేసీఆర్ను తెలంగాణ ప్రజలు మరోసారి పట్టంకట్టారు. ఈ నేపథ్యంలోనే పలువురు ప్రముఖులు రాజకీయవేత్తల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ట్వీట్లరూపంలో మరికొందరు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కెసిఆర్తో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు కూడా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.