కేంద్ర మంత్రి నడ్డాకు బీజేపీ కార్యకర్తల నుంచి నిరసన ఎదురైంది . టికెట్ల కేటాయింపుపై అసంతృప్తితో ఉన్న ఆశావహులు పార్టీ కార్యాలయంలోనే నడ్డాను అడ్డుకున్నారు. జూబ్లీహిల్స్ టికెట్ను స్థానికులకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పార్టీ ఆఫీస్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు కారులో ఎయిర్పోర్ట్ బయలుదేరుతుండగా నడ్డా కారును చుట్టుముట్టారు. దీంతో కారు దిగి నడుచుకుంటూ కొంత దూరం వెళ్లి అక్కడి నుంచి మరోకారులో ఎక్కి బయలుదేరారు.