మహాకూటమి దొంగల కూటమన్నారు ఎంపీ కవిత. వారికి అధికారమిస్తే తెలంగాణకు ద్రోహం చేస్తారని అన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ కు ఓటు వేస్తే టీడీపీకి ఓటు వేసినట్లేనని చెప్పారు. మహాకూటమి అభ్యర్థులను ప్రకటించడంలో అపసోపాలు పడుతుందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పదవికి రాజీనామా చేయాలని కవిత డిమాండ్ చేశారు. చంద్రబాబుతో పొత్తు ఎందుకో కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. కూటమి కుట్రలను ప్రజలు గమనించాలని కోరారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటున్న వారినే మళ్లీ గెలిపించాల్సిందిగా ఆమె పిలుపునిచ్చారు. ప్రజా నాయకుడు బాజిరెడ్డి గోవర్దన్ని మళ్లీ గెలిపించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.