ఆళ్లగడ్డ పంచాయతీ రేపటికి వాయిదాపడింది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలవాలని అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డికి ఆదేశాలు అందాయి. అయితే తనకు పదవులపై వ్యామోహం లేదన్న ఏవీ సుబ్బారెడ్డి కావాలనే అఖిలప్రియ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. రాళ్ల దాడిపై తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. అయితే ఇప్పటికీ అఖిలప్రియను తన కుటుంబ సభ్యురాలిగానే భావిస్తున్నట్లు ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు.