విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు ప్రధానమంత్రి నరేంద్రమోడీని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు ఢిల్లీలో జరిగే రిసెప్షన్కు హాజరవ్వాలని కోరారు. ఈ సందర్భంగా విరుష్క జోడీకి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. కోహ్లీ-అనుష్కశర్మలు ఈనెల 11న ఇటలీలోని టస్కనీలో అతికొద్ది మంది అతిథుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. హనీమూన్ అనంతరం భారత్కు చేరుకున్న కొత్త దంపతులు మోదీని కలిసి రిసెప్షన్కు ఆహ్వానించారు. నేడు ఢిల్లీలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు కోహ్లీ దంపతులు విందు ఇవ్వనుండగా, ఈనెల 26న ముంబైలో బాలీవుడ్ ప్రముఖులకు, క్రికెటర్లకు విందు ఏర్పాటు చేశారు.