తెలంగాణలో బీజేపీ ఎన్నికల ప్రచారం జోరు పెంచింది. రేపు తెలంగాణలో బీజేపీ జాతీయ అద్యక్షుడు అమిత్ షా ప్రచార బరిలో దిగనున్నారు. సభలు, సమావేశాలు, రోడ్ షోలతో ప్రచారాన్ని కమలనాథులు మరింత వేడేక్కించనున్నారు. పర్యటనలో భాగంగా నాలుగు బీజేపీ బహిరంగసభల్లో ఆయన పాల్గొంటారు. ఉదయం వరంగల్ జిల్లా పరకాలలో జరిగే బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగం. అనంతరం మ. 2 గంటలకు నిర్మల్ జిల్లా విశ్వనాథ్పేటలో బహిరంగ సభలో పాల్గోననున్నారు. అనంతరం హుటాహుటిన మ.2.45కు సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్లో భారీ బహిరంగ సభ, సా.5 గంటలకు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీజేపీ సభలో అమిత్ షా పాల్గొననున్నారు.