లోయలో పడ్డ బస్సు: 48 మంది మృతి

Update: 2018-07-02 04:38 GMT

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పారిగల్వార్‌ జిల్లా నానిదండ దగ్గర ప్రయాణికులతో వెళ్తున్న బస్సు  లోయలో పడింది. ఈ ప్రమాదంలో  48 మంది చనిపోయారు.మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.. ప్రమాద విషయంతెలుసుకున్న వెంటనే పోలీసులు, సహాయ సిబ్బంది  అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. మృతదేహాలను బస్సు నుంచి బయటకు తీశారు. ప్రమాద సమయలో బస్సులో 55 మంది ప్రయాణికులున్నారు. రామ్‌ నగర్‌ నుంచి బస్సు భోహన్‌కు బయల్దేరిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది.  బస్సు లోయలో పడిన తర్వాత మరింత లోతుకు జారిపడటంతో మృతుల సంఖ్య పెరిగింది. 
 

Similar News