మేడ్చల్ జిల్లా బొమ్మరాశిపేటలో విషాదం నెలకొంది. కోళ్ల ఫారంలో నలుగురు యువకులు అనుమానాస్పద మృతి చెందారు. మృతులను మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం వెంకటాపురం వాసులుగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులను సతీశ్ గౌడ్(20), అరవింద్ గౌడ్(23), మహేశ్ ముదిరాజ్(20), మహేందర్ రెడ్డి(25)లుగా గుర్తించారు పోలీసులు.