జనసేన అధినేత పవన్కల్యాణ్ చెన్నై చేరుకున్నారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. చెన్నైలో పవన్ కమల్హాసన్తోపాటు పలువురు ముఖ్య నేతలతో భేటీ అవుతారు. కమల్తో భేటీ అనంతరం రాజకీయ సమాలోచనలకు శ్రీకారం చుడతారు. మధ్యాహ్నం 3గంటలకు తాజ్ కొనమేరాలో మీడియాతో మాట్లాడతారు. దక్షిణాది రాష్ట్రానలపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని, అభివృద్ధి కేంద్రీకరణ జరగాలని ఇప్పటికే గళమెత్తిన పవన్ తాజాగా చెన్నైలో పలువురు నేతలతో భేటీ అవుతున్నారు.