కరోనా నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఏప్రిల్ 4 వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫిర్యాదుల స్వీకరణ నిలిపివేస్తూ ఉత్తర్వులు. 50 శాతం ఉద్యోగులు రొటేషన్ పద్దతిలో వారం విడిచి వారం కార్యాలయాల నుంచి పనిచేసేలా వెసులుబాటు.

సెక్రటేరియట్ నుంచి మండల స్థాయి ఉద్యోగుల వరకు వర్క్ ఫ్రమ్ హోమ్. 60 ఏళ్ళు పైబడిన సలహాదారులు,చైర్ పర్సన్లు,కన్సల్టెంట్లు,HODల అనుమతి తో వర్క్ ఫ్రమ్ హోమ్ అమలుకు ఆదేశాలు. సెల్ఫ్ క్వారంటైన్స్ కు వెళ్లే 50 ఏళ్ళు పైబడిన ఉద్యోగులకు వచ్చే నెల 4 వరకు లీవ్ లు.


Update: 2020-03-22 04:30 GMT

Linked news