రిలయన్స్ జియో కొత్త వార్షిక ప్లాన్ను తీసుకొచ్చింది.. రూ. 2121 పేరుతో సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 336 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్లో జుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. జియో నుంచి జియో, ల్యాండ్ లైన్కు అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. జియోయేతర కాల్స్ మాట్లాడుకోవడానికి 12వేల నిమిషాలు అందిస్తున్నారు. రోజుకు 100 ఎస్సెమ్మెస్లు పంపుకోవచ్చు.
జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా ఈ ప్లాన్ కింద లభిస్తుంది.. గూగుల్ పే, పేటీఎమ్తో వంటి యాప్స్లోనూ తాజా ప్లాన్ అందుబాటులో ఉంది. ఇక న్యూ ఇయర్ సందర్భంగా జియో ప్రకటించిన 2020 ప్లాన్ కూడా ఇవే ప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ ఆ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు మాత్రమే ఉండేది. అయితే ప్రస్తుతం 2020 ప్లాన్ అందుబాటులో లేదు.