పార్లమెంటులో వైసీపీ ఇమేజ్ పెరిగేలా ఎంపీలు వ్యవహరించాలి: విజయసాయిరెడ్డి
జాతీయ స్థాయిలో వైసీపీ ఇమేజ్ పెరిగేలా ఎంపీలు వ్యవహరించాలని ఆ పార్టీనేత విజయసాయిరెడ్డి ఎంపీలకు సూచించారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు, రాష్ట్ర సమస్యలను సామరస్యపూర్వకంగా కేంద్రం దృష్టికి ఎలా తీసుకెళ్లాలన్నదానిపై చర్చించారు. వైసీపీ తరఫున ఎన్నికైన ఎంపీల్లో ఎక్కువ మంది కొత్తవారు కావడంతో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను సభలో ఏవిధంగా లేవనెత్తాలన్న అంశాలపై దిశానిర్దేశం చేశారు. సభ్యులంతా పార్లమెంటుకు తప్పనిసరిగా హాజరుకావాలని ఏపీకీ ప్రత్యేక హోదా కోసం ఇచ్చేవరకూ పోరాటం చేయాల్సిందేనని స్పష్టం చేశారు.