తొలి సారి బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న వైఎస్ఆర్‌ సీపీ ...

Update: 2019-07-11 15:03 GMT

ఏపీలో తొలి సారి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్‌ సీపీ తొలి సారిగా శుక్రవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు ఆర్ధిక బడ్జెట్‌తో పాటు వ్యవసాయ ప్రణాళికను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. శాసనసభలో ఆర్ధిక బడ్జెట్‌ను మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ ప్రవేశ పెట్టనుండగా ... వ్యవసాయ బడ్జెట్ ను సీనియర్ మంత్రి బొత్స సత్యానారాయణ ప్రవేశ పెట్టన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సోదరుడు మృతి చెందడంతో బొత్స ప్రవేశ పెట్టనున్నారు. ఇక శాసనమండలిలో సీనియర్ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రవేశపెట్టనుండగా ... వ్యవసాయ ప్రణాళికలను మరో మంత్రి మోపిదేవి వెంకట రమణ ప్రవేశపెడతారు. ఆర్ధిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపేందుకు మంత్రి వర్గం సచివాలయంలోని బ్లాక్ 1లో సమావేశం కానుంది.    

Tags:    

Similar News