చంద్రబాబుపై వైసీపీ ఎంపీ సెటైర్లు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా మరోసారి వ్యంగ్యస్త్రాలు సంధించారు.

Update: 2020-05-18 09:53 GMT
YSRCP MP vijayasai reddy(File photo)

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా మరోసారి వ్యంగ్యస్త్రాలు సంధించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. .. కరోనాపై పోరుకు చంద్రబాబు ఇచ్చిన 10 లక్షల విరాళాన్ని ఐదు కోట్ల మందికి పంచితే, తలకు రెండు పైసలు వస్తాయని నెటిజెన్లు లెక్క తేల్చారు. కుటుంబానికో కోడి గుడ్డు కూడా రాదు కదా బాబూ. ఈ మాట ఎవరైనా అడిగితే, ఓడించిన ప్రజలకు సంపాదనంతా ఇచ్చి లోకేశాన్ని రోడ్డున పడేయాలా అని ప్రశ్నిస్తాడేమో! అంటూ ట్వీట్ చేశారు.

అంతేకాకుండా ఉద్యోగం చేసుకుంటూ తన మానాన తను బతుకుతున్న మత్తు డాక్టర్ ను పచ్చపార్టీ వాళ్లు రోడ్డున పడేశారు. సస్పెండ్ అయ్యేదాక రెచ్చగొట్టారు. పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటే పోలీసులు మెంటల్ హాస్పిటల్ కు తరలించారు. యాక్యూట్ అండ్ ట్రాన్సియెంట్ సైకోసిస్ వచ్చిందని సైకియాట్రిస్టులు తేల్చారని అన్నారు . "కరోనాతో ప్రజలు టెన్షన్ పడుతుంటే నీరో చక్రవర్తిలా ఫిడేల్ వాయిస్తున్నాడు చంద్రబాబు. ఎదుటి వారి దురదృష్టాన్ని చాటుగా గమనిస్తూ ఆనందించే వారిని సైకాలజీలో శాదన్ ఫ్రాయిడా (schadenfreude) అనే రుగ్మతకు గురైన వారిగా భావిస్తారు. బాబుది ఆ కేసే" అని మరో ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి! 




 


Tags:    

Similar News