చంద్రముఖిగా మారిన చంద్రబాబు వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పై ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పై ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన చేశారు.విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా చంద్రబాబు కుటుంబంలో వివాదాలు ఉన్నాయని, ఈ క్రమంలో పెద్దాయన చెంప కూడా చెళ్లుమందని ఆయన అన్నారు. లాక్ డౌన్ లో ఉన్న చంద్రబాబును చూసి నిజంగా నవ్వాల్నో, ఏడవాల్నో అర్థంకావడం లేదని విమర్శించారు.
చంద్రబాబు సైకిల్ పై కూర్చుంటే సైకిల్ కదలదు. చిన్నబాబు సైకిల్ పై కూర్చుంటే సైకిల్ బతకదని చంద్రముఖిగా మారిన చంద్రబాబును వేధిస్తున్న ప్రధానమైన సమస్య అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారం పొగొట్టుకున్నాడు. చిన్నబాబును ఓడగొట్టుకున్నాడు. పార్టీ ప్రెసిడెంట్ పదవిలో కరోనా గబ్బిలంలాగా అంటిపెట్టుకున్నడని, త్వరలో మండలి రద్దు కాబోతోంది అయన కొడుకు పరిస్ధితి ఏంటి ఇవి చంద్రబాబును వేదిస్తున్న ప్రశ్నలని ఆయన అన్నారు.
చంద్రబాబుకు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి ఆలోచనే లేదు...తనను వణికిస్తున్న కుటుంబసమస్యలే ఆయనను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయన్నారు. అందుకే ఇవేమి బయటపడకుండా తాను బాగున్నానని చెప్పుకుని రోజూ పిచ్చిపిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని అయన చెప్పారు. కుటుంబ పరిస్థితి గురించి ఎలా ఉందంటే నా కుమారుడు పరిస్థితి ఏందని ఒకరడిగితే, నాభర్త పరిస్ధితి ఏందని ఇంకొకరడిగితే.. ఏం చేయాలో తెలియక చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ కు లోనవుతున్నాడని అయన చెప్పారు. లోకేశ్ పై కూడా విమర్శలు చేశారు విజయసాయిరెడ్డి పప్పు పరిస్దితి చూస్తే m.l.a కాలేడు, రాజ్యసభ సభ్యుడు కాలేరు ఎమ్మెల్సీ పదవి ఊడిపోతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, లోకేశ్ చాలా కుటంబసమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ముదిరయని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.