పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపటి నుంచి పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రేపటి నుంచి (బుధవారం) పోలీసులకు వారాంతపు సెలవులు అమలు అవుతాయని అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) డాక్టర్ రవిశంకర్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. కానిస్టేబుల్ నుంచి సీఐ వరకు వారంలో ఒకరోజు వీక్లీ ఆఫ్ లభించనుంది.