చంద్రబాబు ఇంట ప్రత్యక్షమైన వంగవీటి రాధా

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు వంగవీటి రాదా కృష్ణ గురువారం ఉదయం నారా చంద్రబాబు ఇంట్లో ప్రత్యక్షమయ్యారు.

Update: 2020-01-09 08:59 GMT

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు వంగవీటి రాదా కృష్ణ గురువారం ఉదయం నారా చంద్రబాబు ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. దీంతో నగరంలో ఇది చర్చనీయాంశయంగ మారింది. అమరావతి జెఎసి ఆధ్వర్యంలో బస్ యాత్ర జరిగింది. ఈ సందర్బంగా పాల్గొన్న చంద్రబాబు, లోకేష్ ను బుధవారం రాత్రి బెంజ్ సర్కిల్‌ వద్ద అరెస్ట్ చేశారు. దాంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబుకు సంకీభావం తెలియజేయడానికే చంద్రబాబు నివాసానికి రాధా వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా ఎన్నికలకు ముందే టీడీపీలో చేరిన రాధా.. ఎన్నికల అనంతరం ఆ పార్టీకి దూరంగా ఉన్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.

నాలుగు నెలల కిందటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కూడా కలిశారు రాధా. దాంతో ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే సడన్ గా ఇవాళ చంద్రబాబు ఇంట ప్రత్యక్షం కావడంతో ఆయన పార్టీ మారరని అర్ధం అయింది. వాస్తవానికి వంగవీటి రాధా ఆరేళ్లపాటు వైసీపీలోనే ఉన్నారు. అయితే విజయవాడ సెంట్రల్ టిక్కెట్ విషయంలో జగన్ తో విభేదించి టీడీపీలో చేరారు. కానీ ఆయనకు పోటీ అవకాశం కల్పించలేదు చంద్రబాబు. అయినా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల కోసం ఆయన ప్రచారం చేశారు రాధా. 

Tags:    

Similar News