వైజాగ్ గ్యాస్ లీకేజ్: పరిస్థితి సమీక్షిస్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి !

Update: 2020-05-07 04:24 GMT

విశాఖపట్టణంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి కెమికల్ గ్యాస్ లీకైన ఘటనపై కేంద్ర హోంశాఖ స్పందించింది. ఘటనకు సంబంధించి హోంశాఖ అధికారులు జిల్లా అధికారుల నుంచి వివరాలు అడిగితెలుసుకున్నారు. ఘటనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.నేటి తెల్లవారుజామున వైజాగ్‌లోని ఒక ప్రైవేట్ సంస్థ వద్ద గ్యాస్ లీక్ అయిన కారణంగా మరణించిన 5 మంది కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఏపీ సీఎస్, డీజీపీతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నాను. అవసరమైన సహాయక చర్యలు అందించాలని ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలకు సూచించాను. నేను పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటాను అని ట్వీట్ చేశారు. 



 


Tags:    

Similar News