ఏపీలో 10మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. గనుల శాఖ కార్యదర్శిగా కె.రాంగోపాల్, విశాఖ మెట్రో పాలిటన్ కమిషనర్గా పి.కోటేశ్వరరావు, ఏపీ స్టెప్ మేనేజింగ్ డైరెక్టర్ గా సి.నాగరాణి, సీసీఎల్ఏ స్పెషల్ కమిషనర్గా హరినారాయణన్ బదిలీ అయ్యారు. ఏపీఐఐసీ ఈడీగా హరినారాయణన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా పి.అరుణ్ బాబు, సీసీఎల్ఏ సంయుక్త కార్యదర్శిగా ఎం.విజయ సునీత, కాపు కార్పొరేషన్ ఎండీగా ఎం.ఎన్. హరేం ధీరప్రసాద్, పరిశ్రమలు, ఇండస్ట్రీస్ కార్యదర్శిగా శ్రీనివాస్ శ్రీ నరేష్, రాజమండ్రి సబ్ కలెక్టర్గా మహేష్ కుమార్ రావిరాల బదిలీ అయ్యారు.