బెజవాడలో టెన్షన్ టెన్షన్

Update: 2019-11-14 07:01 GMT

విజయవాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బందర్ రోడ్ లో దీక్ష చేసేందుకు బయలుదేరిన వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కృష్ణ ప్రసాద్ లను అదుపులోకి తీసుకుని సీపీ కార్యాలయానికి తరలించారు. ఇసుక మాఫియానే ప్రోత్సహించింది చంద్రబాబే అని వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు. ఇప్పుడు దీక్ష పేరిట చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. దమ్ముంటే టీడీపీ తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలన్నారు పార్థసారథి.

Tags:    

Similar News