కోడెల మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
కోడెల మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కోడెలతో తనకు ఉన్నఅనుబంధాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. కోడెల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీ కోడెల శివప్రసాద్ మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.
— Telangana CMO (@TelanganaCMO) September 16, 2019