వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవిపై దాడిని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఖండించారు. ఘటనలో పాల్గొన్న బాధ్యులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏదైనా సమస్యలుంటే చెప్పుకోవాలని కానీ దాడులు చేయడం కరెక్టు కాదన్నారు డొక్కా. రాజధానిలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఉంటారని ఎమ్మెల్యేకే గౌరవం లేకపోతే ఎలా? అని డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రశ్నించారు.