డాక్యుమెంట్లు, సరైన పత్రాలు లేకుండా లోన్లు మంజూరు చేసి అవినీతికి పాల్పడుతున్నారు కడప జిల్లా కాజీపేట సిండికేట్ బ్యాంక్ అధికారులు. బ్యాంక్ మేనేజర్తో పాటు మరికొందరు కలిసి రెండున్నర కోట్ల మేరకు గోల్మాల్ చేశారు. తాజా మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ మేనేజర్ చేసిన స్కామ్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కడప జిల్లా కాజేపట సిండికేట్ బ్యాంకులో 2014 నుంచి 2016 వరకు బ్యాంక్ మేనేజర్గా జయంత్ బాబు విధులు నిర్వహించారు. మరికొంతమందితో కలిసి గ్రామాల్లో ఉన్న కొందరికి డబ్బులు ఆశచూపి నకిలీ పత్రాలు సృష్టించారు. 2.2 కోట్ల రూపాయలు స్వాహా చేశారు. మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు ఆదేశాలతో రూరల్ సీఐ విచారణ చేపట్టారు. కాజీపేట సిండికేట్ బ్యాంక్ మాజీ మేనేజర్ జయంత్ బాబును..ఆయనకు సహకరించిన కాంతమ్మను, విలేకరి వెంకటసుబ్బయ్యను అరెస్ట్ చేశారు.