ప్రభుత్వోద్యోగులకు రెండు దఫాలుగా జీతాలు : ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు సూర్యనారాయణ

Update: 2020-03-31 09:14 GMT

కరోనా నివారణ చర్యల్లో భాగంగా తమవంతు పాత్ర పోషిస్తామని ఏపీ ఎన్జీవో సంఘం ప్రకటించింది. సీఎం జగన్‌తో సమావేశమైన ఎన్జీవోలు పలు ప్రతిపాదనలు తమ ముందు ఉంచారని తెలిపారు. కరోనా నివారణ కోసం తీసుకుంటున్న చర్యలకు ఖజానాపై తీవ్రమైన ఆర్థికభారం పడుతుందని సహకరించాలని విజ్ఞప్తి చేశారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె. ఆర్.సూర్యనారాయణ. ప్రస్తుతం నెల జీతంలో సగం చెల్లిస్తామని మిగతా సగం రానున్న రోజుల్లో చెల్లిస్తామని సీఎం తెలిపినట్లు ఎన్టీవోలు వివరించారు. విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జగన్ నిర్ణయానికి ఒప్పుకుంటున్నామని ఎన్జీవో ప్రతినిదులు వెల్లడించారు.


Tags:    

Similar News