అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Update: 2019-07-06 01:32 GMT

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలమనేరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. 48 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కాలసముద్రం దగ్గర బోల్తా పడటంతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షత్రగాత్రులను కదరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. . ప్రమాద విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ పరారయ్యారు.  

Full View

Tags:    

Similar News