ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: పురందరేశ్వరీ

Update: 2019-07-19 02:22 GMT

 ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై టీడీపీ చేసిన దుష్ప్రచారమే వైసీపీ చేస్తుందన్నారు బీజేపీ సీనియర్ నేత పురందరేశ్వరీ. ఏ రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రం తేల్చి చెప్పినా ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయడంపై మండిపడ్డారామె. విభజన హామీల్లో కడప స్టీల్ ప్లాంట్ దుగ్గరాజపట్నం పోర్టు అంశాలు తప్ప అన్ని అమలు చేసినట్లు చెప్పారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారామె. గోదావరి జలాల విషయంలో నేరుగా కేసీఆర్ తో చర్చించడం కాదు ముందుగా ఏపీ ప్రజలు, అఖిలపక్షంలో చర్చలు జరపాలన్నారు. 

Tags:    

Similar News