పవన్‌కల్యాణ్‌ను అడ్డుకున్న పోలీసులు.. పెన్సింగ్‌ను ఎత్తిపడేసిన జనసేన కార్యకర్తలు

Update: 2019-12-31 08:00 GMT
పవన్‌కల్యాణ్‌ను అడ్డుకున్న పోలీసులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను మందడం సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. రాజధాని పర్యటనలో జనసేనాని పర్యటిస్తున్నారు. రాజధాని కోసం ఆందోళన చేస్తున్న ఎర్రబాలెం రైతులను కలిసి వారితో మాట్లాడారు. అనంతరం మందడం బయలుదేరారు. మర్గమధ్యలో పవన్ వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో సీఎం జగన్ సచివాలయానికి బయలుదేరుతున్నారని, ఇక్కడే నిలబడాలని సూచించారు.

దీంతో పోలీసులు, జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది. కార్యకర్తలు ముళ్లకంచెలను తొలగించి ముందుకు దూసుకువచ్చారు. దీనిపై స్పందించిన పవన్ కార్యకర్తలను సముదాయించి వాహనాలకు అనుమతి లేకపోతే నడుచుకుంటూ మందడం చేరుకుంటామని చెబుతూ వాహనం దిగి కార్యకర్తలతో కలిసి పవన్ పాదయాత్రగా నడుచుకుంటూ మందడం బయలుదేరారు. 

Tags:    

Similar News