జనసేన ఎమ్మెల్యే అరెస్ట్‌కు రంగం సిద్ధం..

తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎమ్మల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మలికిపురం పోలీస్ స్టేషన్ ముట్టడించిన ఘటనలో ఎమ్మెల్యే రాపాకతో సహా అతని అనుచరులపై పోలీసులుకేసు నమోదు చేశారు.

Update: 2019-08-13 06:09 GMT

 తూర్పుగోదావరి జిల్లా రాజోలు ఎమ్మల్యే రాపాక వరప్రసాద్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మలికిపురం పోలీస్ స్టేషన్ ముట్టడించిన ఘటనలో ఎమ్మెల్యే రాపాకతో సహా అతని అనుచరులపై పోలీసులుకేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే రాపాక ప్రసాద్ ను అరెస్ట్ చేయడానికి పోలీసులు రాత్రంతా ప్రయత్నించారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో చింతలమోరిలోని ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు వెనుతిరిగారు. దీంతో స్థానికంగా ఉద్రిత్త వాతావరణం నెలకొంది. పేకాట ఆడుతున్న అభియోగంపై ఎమ్మెల్యే అనుచరుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతడ్ని విడిపించడానికి రాపాక యత్నించారు. ఆ క్రమంలోనే పోలీసులపై రాపాకను దూషించారని జనసైనికులు ఆరోపిస్తుండగా..ఎమ్మెల్యే అనుచరులు పోలీస్ స్టేషన్ పై దాడి చేసి అద్దాలు పగులకొట్టారని పోలీసులు రాపాకపై కేసు పెట్టారు.

Full View

Tags:    

Similar News