అనంతపురం: అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు పనులు పూర్తి చేయడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి వర్గానికి తెలియకుండా విగ్రహం ఎలా ఏర్పాటు చేస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు. పనులు చేయడానికి వీల్లేదని రెవెన్యూ, పోలీస్ అధికారులు అనుమతి నిరాకరించారు. రాత్రికి ఎలాగైనా పనులు చేసి తీరతామని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు విగ్రహం ఏర్పాటుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉరవకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.