జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాను ఓడిపోయినందుకు గర్వపడుతున్నానని అన్నారు. తనపై నమ్మకముంచి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయసమావేశంలో పాల్గొన్న పవన్.. జనసేన పార్టీని ఏ పార్టీలోనూ విలీనం చేయనని స్పష్టం చేశారు. ప్రజలు తమ పార్టీపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటానన్నారు. ఎలాంటి పదవులు ఆశించి తాను రాజకీయాల్లోకి రాలేదని, నిస్వార్థంగా పని చేసే వ్యక్తులు ఇంకా ఉన్నారని చెప్పేందుకే ఎన్నికల్లో పోటీచేశానన్నారు పవన్ కల్యాణ్.