అనంతపురంలో మరో దారుణం వెలుగుచూసింది. కడుపులో ఆడపిల్ల ఉందని శ్రేయ హాస్పిటల్ వైద్యులు నిర్ధారించడంతో గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయడంతో తల్లి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడింది. విషయం బయటకు రావడంతో వైద్యశాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆసుపత్రి డాక్టర్ రాజ్యలక్ష్మిపై కేసు నమోదు చేశారు. హస్పిటల్ సీజ్ చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు.
అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం సోమందేపల్లికి చెందిన శివలక్ష్మి నాలుగు రోజుల క్రితం అనంతపురంలోని శ్రేష్ట హస్పిటల్ కు వైద్య పరీక్షల కోసం వచ్చింది. లింగనిర్ధారణ చేసిన వైద్యులు పుట్టబోయే శిశువు ఆడపిల్లగా నిర్ధారించారు. హస్పిటల్ డాక్టర్ రాజ్యలక్ష్మి మహిళకు అబార్షన్ చేసింది. దీంతో శివలక్ష్మి ప్రాణాలకు ప్రమాదకరంగా మారింది. జిల్లా వైద్య శాఖాధికారి హస్పిటల్ సందర్శించి జరిగిన ఘటనపై విచారణ జరిపారు. శ్రేయ హాస్పిటల్ లో జరిగిన ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు జిల్లా వైద్యాధికారి.