ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య గ్రామ వాలంటీర్లు వారధిగా పని చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఆయన కోరారు. విజయనగరం జిల్లా సాలూరులో గ్రామ వాలంటీర్ల పరిచయ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. అవినీతికి పాల్పడకుండా గ్రామ వాలంటీర్లు నిజాయితీగా పని చేయాలని పిలుపునిచ్చారు.