అనని మాటలను అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు : మంత్రి బొత్స

Update: 2020-02-15 08:03 GMT
అనని మాటలను అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు : మంత్రి బొత్స

వైసీపీ ఎన్డీయేలో చేరవచ్చన్న వార్తలను ఆ పార్టీ నేతలు ఖండించారు. తాను అనని మాటలను అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కొన్ని పత్రికలు చంద్రబాబు, ఓ సామాజిక వర్గం ప్రయోజనాల కోసం పని చేస్తున్నాయని చెప్పారు. ఎందుకు ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మరోవైపు మంత్రి బొత్స అన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. సీపీఐ నేత రామకృష్ణ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని కోరారు.


Full View

 

Tags:    

Similar News