తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఓ ఐదు అంతస్తుల భవనానికి చెందిన పిల్లర్లు భూమిలోకి కుంగిపోవడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. దేవి మల్టీప్లెక్స్ సమీపంలోని భాస్కర్ ఎస్టేట్స్ అపార్ట్మెంట్ పిల్లర్లు భూమిలోకి కుంగిపోయాయి. దీంతో అపార్ట్మెంట్ వాసులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, అధికారులు భయంతో భవనాన్ని ఖాళీ చేయిస్తున్నారు.