రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని అందుకు బీజేపీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. చాలా రాష్ట్రాల్లో రాజధాని ఒకచోట, హైకోర్టు మరోచోట ఉన్నాయని గుర్తుచేశారు. గత పాలకులు రాయలసీమను పట్టించుకోలేదని ప్రస్తుతం రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరగాలని జీవీఎల్ తెలిపారు.