మాజీ సీఎం చంద్రబాబు భద్రతపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. 97మందితో భధ్రతను కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. చంద్రబాబు క్లోజ్ ప్రొటెక్షన్పై NSG, ISW కలిసి నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. మూడు నెలల్లో నిర్ణయం తీసుకుని 5 ప్లస్ 2 భద్రత ఇవ్వాలంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒక CSOనే కొనసాగించాలని కోర్టు తెలిపింది. కాన్వాయ్లో జామర్ వెహికిల్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.