పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి గంటా

-రాజకీయ భవిష్యత్తుపై ఉహాగానాలు మీడియా సృష్టి-గంటా -పార్టీనీ వీడేది లేదు-గంటా శ్రీనివాసరావు

Update: 2019-12-05 13:48 GMT
Ganta Srinivasa Rao

తన రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు మీడియా సృష్టే అన్నారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు. విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న గంటా శ్రీనివాసరావు పార్టీ మార్పు పై క్లారిటీ ఇచ్చారు. తాను ఏదైనా నిర్ణయం తీసుకుంటే ముందే చెప్తానన్నారు. తాను నరేంద్ర మోడీతో కలిసి ఫొటో దిగిన ఫోటో ఇప్పడిది కాదని.. ఉమ్మడి రాష్ర్టంలో మంత్రిగా ఉన్నప్పటిదని.. ఇప్పుడు ఆ ఫోటోను వైరల్ చేశారని చెప్పారు. టీడీపీని వీడేది లేదని స్పష్టం చేశారు.   

Tags:    

Similar News