టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్‌కు తీవ్ర అస్వస్థత

Update: 2019-09-19 13:10 GMT

టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో వారం క్రితం ఆయన చిత్తురులోని ఓ ఆస్పత్రిలో చేరారు. అయితే, మెరుగైన వైద్యం కోసం ఇవాళ ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని ఆపోలో ఆస్పత్రికి తరలించారు. చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి శివప్రసాద్ రెండు సార్లు ఎంపీగా గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం ఆయన పార్లమెంట్ వేదికగా అనేక కళారూపాలను ప్రదర్శించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. 

Tags:    

Similar News