స్విమ్స్ ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగు పరచండి:టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి

Update: 2019-07-04 15:05 GMT

టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్ ఆసుపత్రిలో రోగులకు అవసరమైన అన్నిరకాల సౌకర్యాలను సమకూర్చాల్సిన బాధ్యత మనపై ఉందని అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ ను ఆదేశించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ స్విమ్స్ ఆసుపత్రిలో అన్ని విభాగాలను బలోపేతం చేయాలని ఆదేశించారు ముఖ్యంగా కిడ్నీ బాధితులు సకాలంలో వైద్య సేవలు అందేలా చూడాలని సూచించారు. అలాగే క్యాన్సర్ రోగుల రిజిస్టర్ ను ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో వివరాలు నమోదు చేయాలని సూచించారు. ముఖ్యంగా ఆసుపత్రి ఆవరణలో పచ్చదనాన్ని పెంపొందించుకోవడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు అవసరమైతే తుడా సహకారంతో స్విమ్స్ ఆవరణ లో పచ్చదనాన్ని పెంపొందించాలని ఆయన సూచించారు .

తిరుమల త్రాగునీటి సమస్య కు శాశ్వత పరిష్కారం చూడాలి

తిరుమలలో త్రాగునీటి సమస్య శాశ్వతంగా శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రత్యాస్విమ్స్ ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగు పరచండి:టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డిమ్నాయ మార్గాలను అన్వేషించి తగు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ శాఖను ఆదేశించారు గురువారం పద్మావతి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన తిరుమల త్రాగు నీటి అవసరాలు లభ్యత ప్రత్యామ్నాయ మార్గాలు తదితర అంశాలపై చర్చించారు ఈ సమావేశానికి తిరుమల జెఇఓ బసంత్ కుమార్ ఇంజనీరింగ్ సి ఈ మురళి నాథ్ రెడ్డి, ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి హాజరై సమగ్ర వివరాలను చైర్మన్ కు అందించారు ముఖ్యంగా తిరుమలకు ఏటా 0.5 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులలో వాతావరణంలో మార్పులు కారణంగా అక్టోబర్ నాటికి నీటి నిల్వలు పడిపోతాయని తెలిపారు. తిరుమలలో పాపవినాశనం గోగర్భం డ్యామ్ పసుపుధారా కుమారధార కళ్యాణి డ్యామ్ తెలుగు గంగ నుంచి నీటిని పొందుతున్నామని వీటిలో ప్రస్తుతం నీటి లభ్యత లేకపోవడంతో సమస్య తలెత్తుతుందని వారు వివరించారు. అనంతరం బాలాజీ రిజర్వాయర్ ద్వారా నీటి పంపిణీ చేయడానికి సాధ్యాసాధ్యాలను గురించి చర్చించారు. బాలాజీ రిజర్వాయర్ను త్వరగా పూర్తి చేయడం ద్వారా సమస్య కొంత మేర పరిష్కారం అయ్యే అవకాశం ఉందని ఇంజనీరింగ్ అధికారులు చైర్మన్ కు వివరించారు. దాని నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా పదిహేను రోజుల లోపు ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి సంపూర్ణ స్థాయి నివేదికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News