అశ్వవాహనంపై ఉపమాక వెంకన్న తిరువీధి సేవ

ధనుర్మాసోత్సవాలలో భాగంగా ఉపమాక వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో సోమవారం ఉదయం అశ్వవాహనంపై స్వామి తిరువీధి సేవ ఘనంగా నిర్వహించారు.

Update: 2019-12-23 11:16 GMT

పాయకరావుపేట: ధనుర్మాసోత్సవాలలో భాగంగా ఉపమాక వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో సోమవారం ఉదయం అశ్వవాహనంపై స్వామి తిరువీధి సేవ ఘనంగా నిర్వహించారు. గరుడాద్రి కొండపై కల్కి వేంకటేశ్వర స్వామి వారి మూలవిరాట్కు అర్చకుడు కృష్ణమాచార్యులు అభిషేకం నిర్వహించారు.

కొండ దిగువున క్షేత్ర పాలకుడు వేణుగోపాల స్వామికి, ఉపాలయాలలో ప్రధాన అర్చకుడు ప్రసాదాచార్యులు, అర్చకులు శేషాచార్యులు, గోపాలాచార్యులు నిత్య కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరం ఉభయ దేవేరులతో స్వామి వారిని అశ్వవాహనపైన గోదాదేవి అమ్మవారిని పల్లకీలోను ఉంచి గ్రామ తిరువీధి సేవ నిర్వహించారు.

Tags:    

Similar News