కోర్టులో లొంగిపోయిన కోడెల శివరాంకు బెయిల్ మంజూరు

Update: 2019-10-01 10:45 GMT

నరసరావుపేట కోర్టులో లొంగిపోయిన కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాంకు బెయిల్ మంజూరయ్యింది. నరసరావుపేట 1వ అదనపు జడ్జి కండిషన్ బెయిల్ మంజూరు చేశారు. అయితే ప్రతీ సోమవారం, బుధవారం, శనివారం విజయవాడ కమిషనర్ ఆఫీస్‌లో సంతకం పెట్టాలని తెలిపారు. ఈ నేపథ్యంలో కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామని కోడెల శివరాం తరపు న్యాయవాది షేక్ అబ్దుల్ రజాక్ తెలిపారు.

Tags:    

Similar News