నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్లో మాట్లాడటంపై సీరియస్ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ ఇన్ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డితో చర్చించిన జగన్ ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకంగా మాట్లాడటంపై అసంతృప్తి వ్యక్తంచేశారు.
ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకిస్తే పేద పిల్లల అభ్యున్నతిని అడ్డుకున్నట్టేనన్న జగన్ ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే పార్టీపరంగా చర్యలకు వెనుకాడబోమని వైవీ సుబ్బారెడ్డికి స్పష్టంచేశారు.