తుడా చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

Update: 2019-06-16 04:10 GMT

తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. తొలిసారి మంత్రి వర్గంలో స్థానం లభించకపోవడంతో ప్రభుత్వ విప్ పదవి ఇచ్చిన సీఎం జగన్.. తుడా చైర్మన్‌గా కూడా నియమించారు. గతంలో తుడా చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన చెవిరెడ్డి మరోసారి ఆ పదవీ బాధ్యతలు స్వీకరించారు. తన రాజకీయ గురువు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి పాదాలకు నమస్కరించి సీట్లో కూర్చొన్నారు. తుడా పరిధిలో ప్రజాప్రయోజన కార్యక్రమాలు చేపడతామని, సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని ఆయన చెప్పారు. 

Tags:    

Similar News