కృష్ణాపురం ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేపీ ఉల్లిపై నిషేధం తొలగించి రైతులను ఆదుకోవాలని కోరుతూ గత నవంబర్లోనే ముఖ్యమంత్రి వైయస్ జగన్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్కు లేఖ రాశారు. కృష్ణాపురం ఉల్లి ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వేల మెట్రిక్ టన్నుల ఉల్లిని చెన్నై పోర్టు నుంచి ఎగుమతి చేసేందుకు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో మార్చి 31లోగా ఎగుమతులు పూర్తి చేయాలని ఆదేశించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.